కార్పొరేటర్ రాసూరి సునీత
అడ్డగుట్ట, నవంబర్ 30 : ప్రతి ఒక్క లబ్ధ్దిదారుడికి సంక్షేమ ఫలాలు చేరేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత అన్నారు. బుదవారం మెట్టుగూడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొంతమందికి, మరికొందరికి వారి ఇండ్ల వద్దకే వెళ్లి ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ ఫలాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు. లబ్ధ్దిదారుల పరిస్థితిని బట్టి వారి ఇండ్ల వద్దకే వెళ్లి గుర్తింపు కార్డులను అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఇంటింటికీ తిరుగుతూ 320 మంది లబ్ధ్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశా మన్నారు.