శంషాబాద్ రూరల్, జనవరి 4: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ‘ప్రజాపాలన’లో అర్హులంతా దరఖాస్తులు చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు. గురువారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 24, 25వ వార్డు ఆర్బీనగర్ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఆయవ నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, కౌన్సిలర్ పుష్పలత, మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, కమిషనర్ భోగేశ్వర్లు, నాయకులు బుచ్చిరెడ్డి, కొన్నమొల్ల శ్రీనివాస్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ భారతమ్మను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పరామర్శించారు.