సంక్షేమ ప్రదాత.., తెలంగాణ జాతిపిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిండు నూరేళ్లు చల్లంగా జీవించాలని రాష్ట్ర ప్రజానీకం ఆ భగవంతుడిని నిండు మనస్సుతో వేడుకున్నది.
గురువారం 68వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు. కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దీంతో నగర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది.
సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ భవన్వద్ద 68 శాంతికపోతాలను ఎగురవేస్తున్న టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్, తదితరులు
నాచారం ఈఎస్ఐ దవాఖానలో మొక్కను నాటుతున్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఈఎస్ఐ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఆర్.చలపతిరావు, సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ, డాక్టర్ చీమ శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు
దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు వూర నర్సింహ గుప్త ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ కార్పొరేటర్ భవానీప్రవీణ్కుమార్
నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్, ఎక్సైజ్ అధికారులు
చైతన్యపురిలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు విశ్వప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్గుప్త, భానుప్రసాద్, తదితరులు ముగ్గుతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గీసి శుభాకాంక్షలు తెలుపుతున్న మణికొండ టీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, నాయకులు
మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలోకార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్లతో కలిసి మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్