సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ.. ప్రఖ్యాత న్యూరోసర్జన్ డాక్టర్ ప్రతాప్కుమార్ పర్యవేక్షణలో తెలంగాణ న్యూరోసైన్సెస్ సొసైటీ అండ్ ఆగాఖాన్ అకాడమీలో చదువుతున్న 11వ తరగతి విద్యార్థి ప్రియాంషు నందిగామ నేతృత్వంలో వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి.. హెల్మెట్ ధరించాలని తెలిపారు.
ఆదివారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ సుబ్బరాయుడు, ఏసీపీ మట్టయ్య, పీడియాట్రిషన్ డాక్టర్ శ్రీకాంత్, ప్రియాంషు, ఫిట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు స్వామి, కేబీఆర్ పార్కు వాకర్స్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.