ముషీరాబాద్ : కవాడిగూడ డివిజన్ సింగాడికుంటలో కలుషిత నీటి సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. శిథిల పైపులైన్ల స్థానంలో నూతనంగా పైపులైన్ నిర్మాణం చేపట్టి కలుషిత జలాలు సరఫరా కాకుండా చూస్తామన్నారు.
సోమవారం ఆయన సింగాడికుంటలో రూ 19 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీలు, కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.
కొత్త పైపులైన్ల నిర్మాణం కోసం ఇటీవల కోట్లాది రూపాయ బడ్జెట్ మంజూరు చేయించడం జరిగిందని, ప్రస్తుతం పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడా పనుల్లో జాప్యం లేకుండా పనులు పూర్తి చేసిన కలుషిత, డ్రైనేజీ లీకేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం చంద్రశేఖర్, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, వల్లాల శ్యామ్ యాదవ్, సాయికృష్ణ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రామ్చందర్, రాజశేఖర్గౌడ్, శ్రీహరి, ప్రభాకర్, ప్రవీణ్, జమాలుద్దిన్, ముచ్చకుర్తి ప్రభాకర్, కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.