అమీర్పేట్ : దాసారం హట్స్ వాసులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో హట్స్ నివాసితులు పెద్దసంఖ్యలో తరలి వెళ్లి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ను కలిసి తమకు నల్లా కనెక్షన్లతో పాటు విద్యుత్ సదుపాయాలు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్పందించిన మంత్రి వెంటనే హట్స్లో అధికారులతో కలిసి పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హట్స్ నివాసితులను ఉద్దేశించి మాట్లాడుతూ దాసారం హట్స్ నివాసితులు కోరుతున్న సదుపాయాలు కల్పించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు.
హట్స్ సమీపంలో జరిగే రోడ్డు నిర్మాణ పనులతో తమ గుడిసెలు పోతాయంటూ స్థానికంగా కొందరు ప్రచారం చేస్తున్న అంశాన్ని హట్స్ నివాసితులు మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు మంత్రి తలసాని స్పందిస్తూ ఎటువంటి రోడ్డు నిర్మాణాలు జరిగినా.. ఇక్కడి గుడిసెలకు వచ్చిన ముప్పు ఏదీలేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.