-కవులు, కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట
-వారసత్వ, పురాతన కట్టడాలను పరిరక్షిస్తాం
మహేశ్వరం : మహేశ్వరంలోని ప్రసిద్ధి గాంచిన గడికోటను పురావస్తు, పర్యాటక శాఖ అధ్వర్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం గడీకోట మైదానాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చారిత్రాత్మక వారసత్వ సంపదను భావి తరాలకు అందించడంలో బాగంగా నాటి చిహ్నాలను, కట్టడాలను కాపాడుతూ మరిన్ని నూతన హంగులతో మెరుగులు దిద్ధి అభివృద్ధి చేయనున్నామని వారు తెలిపారు. గడీకోట చుట్టు పచ్ఛదనాన్ని పెంపొందించేలా పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు.
గడీకోట అభివృద్ధిపై ప్రణాళికలు సిద్దం చేయాలని వారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం పురాతన కట్టడాల పరిరక్షణకు నడుం బిగించిందని వారు అన్నారు. అక్కన్న , మాదన్నల కాలం నాటి చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని వారు తెలిపారు.
మన్సాన్పల్లిలో 2 ఎకరాల్లో ఆట స్థలం, 1 ఎకరంలో షాపింగ్ మాల్, 1 ఎకరంలో పంక్షన్హాల్ను నిర్మిస్తామని వారు తెలిపారు. తెలంగాణకు టూరిజం ప్రాజెక్టుగా పోచంపల్లి చరిత్ర కెక్కిందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపు నిస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరెక్టర్లు రాములు నాయక్, నారాయణ తాసీల్దార్ ఆర్పీజ్యోతి, టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అంగోతు రాజునాయక్, మాజీ అద్యక్షులు హనుమగల్ల చంద్రయ్య జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, శివగంగ దేవాలయ చైర్మన్ సుధీర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.