సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి : ఎన్ఫోర్స్మెంట్లో చలాన్లు వేయడం ఒక్కటే కాదని, రద్దీ సమయంలో ట్రాఫిక్ నియంత్రణపైనే దృష్టి పెట్టాలని నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. ట్రాఫిక్ అవగాహన వారంలో భాగంగా గురువారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ వలంటీర్లను సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ర్టాలలో లేని విధంగా ట్రాఫిక్లో పనిచేసే సిబ్బందికి 30శాతం అదనంగా ప్రభుత్వం అలవెన్స్లు కల్పిస్తుందని ఇది మంచి పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా ఫ్రీ లెప్ట్ బోర్డులను, అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, జాయింట్ సీపీ రంగనాథ్, డీసీపీలు సుబ్బారాయుడు, విజయ్కుమార్, శ్రీబాల తదితర అధికారులు పాల్గొన్నారు.