నేరేడ్మెట్, డిసెంబర్ 28 : ఫంక్షనల్ వర్టికల్స్లో రాచకొండ కమిషనరేట్ తెలంగాణ రాష్ట్రంలోనే టాప్లో నిలువగా.. ఇందులో మల్కాజిగిరి డీసీపీ పరిధిలోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఈ యేడాది మొత్తం 1120 కేసులు నమోదయ్యి టాప్-9లో నిలిచింది. గత యేడాది 1012 కేసులు నమోదు కాగా.. ఈ యేడాది కొంచం పెరిగాయి. అయితే.. ఇందులో మామూలు కేసులు పెరిగినా.. నేరాల సంఖ్య మాత్రం తగ్గింది. ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, కానిస్టేబుళ్ల సమష్టి కృషి, పటిష్ట నిఘాతో గతంలో కంటే నేరాల సంఖ్య తగ్గింది. స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికి న్యా యం జరుగుతుండటంతోపాటు సీసీ కెమెరాలు సైతం నేరాల నియంత్రణకు దోహదపడుతున్నాయి. ఈ యేడాది నమోదైన కేసుల్లో అదృశ్యం కేసులే అధికం. రెండో స్థానంలో భార్యాభర్తల పంచాయితీలు ఉన్నాయి. స్టేషన్ పరిధిలో అత్యధికంగా మధ్య, ది గువ తరగతి ప్రాంతాలే ఉన్నాయి. తెల్లారేసరికి అదృశ్యం, భార్యభర్తల పంచాయితీలే పోలీస్ స్టేషన్ గుమ్మం తడుతాయి. ప్రతినిత్యం ఆరు నుంచి పది కేసులు భార్యాభర్తల పంచాయితీలే వస్తాయి. స్టేషన్ పరిధిలో డిఫెన్స్కాలనీ, వాయి పురికాలనీ మినహా అన్ని మధ్య తరగతి ప్రాంతాలే. ఇందులో నాలుగు సెక్టార్లు ఉన్నాయి.
ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల అదుపునకు కృషి చేస్తు న్నాం. ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నాం. సీసీ కెమెరాలు సైతం నేరాల నియంత్రణకు దోహదపడుతున్నాయి. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, ఏసీపీ రష్మీ పెరుమాళ్ సూచనలు, సిబ్బంది సమన్వయంతో నేరాల అదుపున కు కృషి చేస్తున్నాం.
– నర్సింహస్వామి, నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్