సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్కు గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 9.35కి బేగంపేట్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు.
అక్కడి నుంచి ఆయన జూబ్లీహిల్స్ రోడ్డు నెం.29లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆయన వెళ్లే రూట్లోని పీఎన్టీ ఫ్లైఓవర్, శ్యామ్లాల్ బిల్డింగ్, హెచ్పీఎస్ బేగంపేట్, బేగంపేట్ ైప్లెఓవర్, పంజాగుట్ట ైప్లెఓవర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రోడ్డు నెం. 29కి చేరుకుంటారు. ఆయన ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.