తెలుగుయూనివర్సిటీ, అక్ట్టోబర్ 3 : ప్రాచీన వైద్యమే ఉత్తమమైనదని సంప్రదాయ వైద్య నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత విజయ్కుమార్ షా అన్నారు. తొలిసారిగా 250 మంది సంప్రదాయ, ప్రకృతి వైద్య నిపుణులను గాంధీ జయంతి సందర్భంగా అవార్డులు అందజేశారు. సిద్ద వైద్య ఇనిస్టిట్యూట్, వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో నేషనల్ హోలిస్టిక్ హెల్త్ కేర్, అల్టర్నేటివ్ మెడిసిన్ ఎక్సలెన్సీ స్టార్ అవార్డు – 2021 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్కుమార్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రకృతి వై ద్యాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడుతూ.. కరోనా ను తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. షణ్ముగవేద సిద్దవేద వైస్ చాన్స్లర్ నా రాయణ మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యానికి ప్రాచుర్యం కల్పించేలా.. కరోనా కాలం కనిపించిందన్నారు. తక్షశిల, నాగార్జున కొండ ప్రాంతాల్లో ప్రాచీన వైద్య చికిత్సా కేంద్రాలు వెలుగొందాయని చరిత్ర చెపుతుందని ఆయన వివరించారు. చైనా కూడా 70 శాతం సంప్రదాయ వైద్య విధానాలను కరోనా నివారణకు నమ్ముకుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు సంతోష్ కుమార్, కర్లేటి, మిల్లెట్ రాం బాబు, శైలజ సాగా, దైవజ్ఞశర్మ, చందు, శైలజ, సుధా జైన్, అలీ, రవీంద్ర క పాడియా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వంశీ, పి. అభినవ్, అభిషేక్, శేఖర్, భాను, వెంకట్ పర్యవేక్షించారు.