చిక్కడపల్లి, జూలై31: తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు, కళా సంస్థలకు మంచి గుర్తింపు లభిస్తోందని ఢిల్లీ తెలంగాణ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ మ్యుజీషియన్స్ అసోసియేషన్కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేణుగోపాలాచారి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కరోనా కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కళాకారుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాచం ఫౌండేషన్ అధ్యక్షుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జడ్జి బూర్గుల మధుసూదన్, ఏవీకే ఫౌండేషన్ అధ్యక్షుడు వై.ఎస్. రామకృష్ణ, ఏఆర్కే గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ కె.ఈ. రాజు, సీఎంయూ అధ్యక్షురాలు విజయలక్ష్మి, వినోద్బాబు, సంగీత కళాకారులు శశికళ, సురేఖమూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు జయకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గోవింద్చారి, ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, సంయుక్త కార్యదర్శి సత్యభరణి, కోశాధికారి సూర్యతేజ, ఫైనాన్సియల్ అడ్వైజర్, రేణుకారమేశ్ పాల్గొన్నారు.