చర్లపల్లి, మే 11: చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం(Cherlapally Open Jail) సూపరింటిండెంట్గా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఓపెన్ జైలు సూపరింటిండెంట్గా పనిచేసిన సమ్మయ్య రెండు నెలల క్రితం పదవీవిరమణ పొందారు. దీంతో అప్పటి నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటిండెంట్గా పనిచేస్తున్న రామచంద్రం ఖైదీల వ్యవసాయక్షేత్రం ఇన్చార్జీగా బాధ్యతలు నిర్వహించారు.
ఇటివల పదోన్నతులలో భాగంగా ఖమ్మం జిల్లా జైలు అధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును పదోన్నత్తి కల్పిస్తు చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం సూపరింటిండెంట్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల సంక్షేమానికి చర్యలు తీసుకొవడంతోపాటు సిబ్బంది సహకారంతో జైలు అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.