కవాడిగూడ, మార్చి 13: సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని ప్రముఖ కవయిత్రి మొల్లమాంబ తెలుగులోకి అనువదించారని పలువురు వక్తలు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై మొల్ల విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు హాజరయ్యారు. మొల్ల విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కవయిత్రి మొల్లను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండారి భిక్షపతి, అధ్యక్షుడు దర్పల్లి మహేందర్, ప్రధాన కార్యదర్శి రమాన్కోల్ వీరేశం, కోశాధికారి మువ్వల అశోక్ మాట్లాడుతూ మొల్ల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు అరుణ్కుమార్, లక్ష్మీనారాయణ, రాజేందర్, శ్రీనివాస్, జితేందర్, నితీశ్, సత్యనారాయణ, కృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.