గోల్నాక, సెప్టెంబర్ 18: రోజు రోజుకూ అంతరించి పోతున్న కుల వృత్తుల పూర్వ వైభవానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జంట నగరాల మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట కేతేశ్వర కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు, బీజేపీ నేత బి.వెంకట్రెడ్డి, కార్పొరేటర్లు అమృత, పద్మా వెంకట్రెడ్డి, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, కన్నె ఉమా రమేశ్ యాదవ్ తదితరులతో కలసి ఆయన హాజరై మాట్లాడారు. అడవుల్లో వెదురును పరిరక్షించడంతో పాటు మేదరులకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. కుల వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మేదరుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మేదర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.మురళీకృష్ణ, పుట్ట యా దగిరి, జొర్రీగల శ్రీధర్, పాతకోటి మహేశ్ పాల్గొన్నారు.