చర్లపల్లి, జూన్ 9: నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ శివసాయినగర్ ఫేజ్-3లో సుమారు రూ.48లక్షలతో చేపట్టనున్న నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ కోటేశ్వర్రావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు కాలనీల్లో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తా మన్నారు.
అన్నివర్గాల సంక్షేమం కోసం సామాజిక భవన నిర్మా ణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్, వీఎన్రెడ్డినగర్లో సుమా రు రూ. 25లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మా ణ పనులకు బుధవారం స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి శంకుస్థాపన చేశారు.
కాప్రా సర్కిల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జేకేనగర్లో ఆయన పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్కిల్ డీఈ బాలకృష్ణ, ఏఈ సత్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, డిప్పు గిరిబాబు, జాండ్ల ప్రభాకర్రెడ్డి, పాండాల శివకుమార్గౌడ్, కనకరాజుగౌడ్, విద్యాసాగర్, కర్రె సత్యనారాయణ, వెంకటేశ్, చంద్రమౌళి, జయకృష్ణ, బాబుగంగపుత్ర, బత్తుల శ్రీకాంత్యాదవ్, నర్సింహగౌడ్, పరశురాం, వినోద్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు విజయ, అరుణ, మోహన్రెడ్డి, సత్యంయాదవ్, రమేశ్ పాల్గొన్నారు.
రామంతాపూర్: రామంతాపూర్ చిన్న చెరువులో గుర్రపు డెక్కను తొలగించడంలో అధికారుల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం చిన్న చెరువును సందర్శించారు. అభివృద్ధికి మారు పేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శాగ రవీందర్, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, టీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, ఆలె రమేశ్, సూరం శంకర్, చాంద్పాష, గరిక సుధాకర్, ఎంటమాలజీ సీనియర్ అధికారిని రజని, సర్కిల్ ఇన్చార్జి నరేశ్రెడ్డి, కుమారస్వామి, బాలకృష్ణగౌడ్, నారాయణదాసు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, డీసీ శంకర్తో కలిసి రూ.62 లక్షలతో చేపట్టిన బాక్స్డ్రైన్ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభు త్వం బాక్స్ డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో ఈఈ కోటేశ్వర్రావు, ఏఈ వేణు, టీఆర్ఎస్ నాయకులు వాసుగౌడ్, నెమలి రవి, దామోదర్, ప్రవీణ్కుమార్, జీవన్రెడ్డి, పద్మారెడ్డి, ప్రభాకర్రెడ్డి, అశోక్గౌడ్, నర్సిరెడ్డి, వీరస్వామి, శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, రవీందర్రెడ్డి, పరమేశ్, ఫాతిమా, మోహన్ పాల్గొన్నారు.