హైదరాబాద్: నగరంలోని కోకాపేట (Kokapet) సెవెన్హిల్స్ వద్ద దారుణం చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం సెవెన్హిల్స్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. వారం, పది రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.