మన్సూరాబాద్, ఏప్రిల్ 2: విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని సరూర్నగర్ సర్కిల్ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. వంటవార్పు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఈశ్వర్రావు, షాకత్ పాష, డప్పు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.