బేగంపేట్ జూలై 19: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అమ్మవారికి సమర్పించే పట్టుచీరను ఆలయంలోనే తయారు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం ఆ చీర తయారీ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మగ్గంపై ప్రారంభించారు. 10మంది చేనేత కార్మికులు ఎంతో నిష్టతో ఈ చీరను తయారు చేస్తారని తెలిపారు. ఈనెల 25,26న నిర్వహించే బోనాల జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ చీరను 25న అమ్మవారికి సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్రెడ్డి, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్,పద్మశాలి సంఘం అధ్యక్షుడు జయరాజ్ పాల్గొన్నారు.
బోనాల జాతరను ఘనంగా నిర్వహించడం కోసం ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. సోమవారం మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆ చెక్కును ఆలయ ఈవోకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.