హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ, ఏఎస్ రావ్ నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. ఇద్దరి మృతికి అతివేగం కారణమవడం గమనార్హం. ఆదివారం ఉదయం కుషాయిగూడలో వేగంగా బైక్పై దూసుకొచ్చిన యువకులు డివైడర్ను ఢీకొట్టారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ఇదే తరహా ప్రమాదం ఏఎస్ రావు నగర్లో కూడా చోటుచేసుకున్నది. కేటీఎం బైక్పై అతివేగంగా వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలవండంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ రెండు ఘటనపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదాలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.