ఆర్కేపురం, మే 25 : ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో మరో రెండు కొత్త మినీ ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వెల్లడించారు. వనస్థలిపురం పనామా, హయత్నగర్ బస్టాండ్ వద్ద వంతెనల నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభంకానున్నట్లు తెలిపారు.
బుధవారం ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ శాఖ కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డితో కలిసి ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులపై ప్రతిపాదనలు చేశారు. అలాగే ఎలక్ట్రిక్ కార్ల వాహనదారులకు పార్కింగ్తో పాటు చార్జింగ్ పెట్టుకునే విధంగా సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.