బంజారాహిల్స్,డిసెంబర్ 24 : బిగ్బాస్ ఫైనల్స్( Bigg Boss) అనంతరం జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్యాన్స్ విద్యంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో బిగ్బాస్ విజేత పల్లవీ ప్రశాంత్తో సహా ఇప్పటికే 20మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరిని అరెస్ట్(Arrested) చేశారు. సరూర్నగర్కు చెందిన హరినాథ్రెడ్డి(20) అనే విద్యార్థితో పాటు యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద హోటల్లో పనిచేస్తున్న ఎం.సుధాకర్(23) అనే యువకుడు గొడవల్లో పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటు ఇందిరానగర్కు చెందిన పవన్ (22) అనే ఆఫీస్ బాయ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.