సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్’ ప్రత్యేక నిఘాతో ఇటీవల వ్యభిచార నిర్వాహకులు, ఉపాధి అవకాశాల పేరుతో మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ఉప్పల్ చిలుకానగర్కు చెందిన మేకల అఖిల్ కుమార్, సురేష్ బోయిన అలియాస్ కుమార్శెట్టిలు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి యువతులను రప్పించి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. లోకాంటో, బ్యాక్పేజ్, స్కొక్క.ఇన్ తదితర వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూప్స్లో ప్రకటనల ద్వారా విటులను ఆకర్శిస్తూ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఏహెచ్టీయూ బృందం నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. వీరిపై మాదాపూర్, పంజాగుట్ట ఠాణాల్లో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.