మైలార్దేవ్పల్లి, ఫిబ్రవరి 21 : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. డబీల్పూరలోని భరత్నగర్కు చెందిన బాలిక పలు ఇళ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నది. చార్మినార్ ప్రాంతానికి చెందిన యువకుడు బాలికకు పరిచయం అయ్యాడు.
ఆదివారం రాత్రి వట్టేపల్లికి చెందిన మరోయువకుడితో కలిసి బాలికను బెదిరించి వట్టేపల్లిలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. సోమవారం ఉదయం ఇంటికి చేరిన బాలికను తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు డబీర్పూర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్కు బదిలీచేశారు. సీఐ మధు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.