హైదరాబాద్: హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) అడ్డగుట్టలో (Addagutta) విషాదం చోటుచేసుకున్నది. పొట్టకూటికోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు కూలీలు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పరంజి గోడ కూలి మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు.
మృతులను ఒడిశాకు చెందిన సంతోశ్, సోనియాగా గుర్తించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.