అబిడ్స్, మే 16 : ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గం గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కమ్యూనిటీలో, జాంబాగ్ డివిజన్ పరిధిలోని సుబాన్పురా కమ్యూనిటీహాళ్లలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 153 బస్తీ దవాఖానాలు పని చేస్తుండగా, నూతనంగా 14 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు వివరించారు. బస్తీ దవాఖానాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా అందజేస్తారని, అవసరమైనవారికి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి దవాఖానలకు పంపిస్తారని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానలలో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా అందుతున్నాయని వివరించారు. అంతే కాకుండా ప్రభుత్వ దవాఖానాలలో గుండె మార్పిడి, మోకాళ్ల చికిత్స, కిడ్నీ మార్పిడి వంటి అనేక శస్త్ర చికిత్సలను ఉచితంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుబాన్పురా బస్తీ దవాఖానలోని ఓ బ్లాక్ను బీఆర్ఎస్ నాయకులు ఎం. ఆనంద్కుమార్గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరో గ్య అధికారి డాక్టర్ వెంకటి, ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్బేగ్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి నందకిషోర్ వ్యాస్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్యాదవ్, కార్పొరేటర్లు డాక్టర్ సురేఖ, మాజీ కార్పొరేటర్లు మమత సంతోష్గుప్తా, ముఖేశ్ సింగ్, పరమేశ్వరీసింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్వీ మహేందర్కుమార్, ఎం. ఆనంద్కుమార్గౌడ్, ఆశిష్కుమార్ యాదవ్, ధన్రాజ్, ఆల పురుషోత్తం, శాంతి దేవీ, పి. అనిత, శీలం సరస్వతీ, ప్రియాగుప్తా, క్రాంతి, వినోద్యాదవ్, అశోక్, సాయి, దశరథ్, ఉమా, జయశంకర్, పొన్నం శంకర్, సురేష్ ముదిరాజ్, రవీంద్రచారి, కోటి శైలేశ్ కురుమ, రాజాసింగ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.