జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23: పోలీసు సిబ్బందికి ఇచ్చే శిక్షణ.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందని, ఈ విలువైన శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా పేర్కొన్నారు.
శుక్రవారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో కమాండెంట్ పి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి 9 నెలల పాటు నిర్వహించనున్న ఎస్సీటీపీసీ శిక్షణ కార్యక్రమాన్ని టీఎస్ఎస్పీ డీఐజీ ఎంఎస్. సిద్దిఖీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నరేందర్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్ఐలు, ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.