TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది. సికింద్రాబాద్ – పటాన్చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏసీ బస్సులు డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
సికింద్రాబాద్ – పటాన్చెరు మార్గంలో ప్రతి 24 నిమిషాలకో ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 219 నంబర్తో నడిచే ఈ బస్సులు ప్యారడైస్, బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి మీదుగా పటాన్చెరు వరకు రాకపోకలు కొనసాగిస్తాయి. సికింద్రాబాద్ నుంచి తొలి బస్సు ఉదయం 6:10 గంటలకు, చివరి బస్సు రాత్రి 8:28 గంటలకు పటాన్చెరుకు బయల్దేరనుంది. పటాన్చెరు నుంచి తొలి బస్సు ఉదయం 7:45 గంటలకు, చివరి బస్సు రాత్రి 10:03 గంటలకు సికింద్రాబాద్కు బయల్దేరనుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ బస్సులను వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
ప్రయాణికులకు శుభవార్త! సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను #TSRTC వాడకంలోకి తెచ్చింది. శుక్రవారం (తేది:15.12.2023) నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. ఈ రూట్ లో ప్రతి 24 నిమిషాలకో ఏసీ మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 219 రూట్ నెంబర్ గల ఈ… pic.twitter.com/H213nRAwmW
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 13, 2023