లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యం కోసం బస్పాస్ కౌంటర్లను తెరిచే ఉంచనున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధి లోని అన్ని రూట్లలో సిటీ బస్సులను తిప్పుతున్నారు. అలాగే ప్రయాణికుల సౌకర్యం కోసం ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు బస్ పాస్ కౌంటర్లు తెరిచే ఉంటాయని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు