సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ తగ్గడం లేదు. నచ్చిన నంబర్ కోసం ఎంత సొమ్మునైనా వెచ్చించడానికి వాహనదారులు సై అంటున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో టీఎస్09ఎఫ్టీ9999 నంబర్ను కీస్టోన్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ రూ.20.10 లక్షలకు సొంతం చేసుకుంది. టీఎస్09ఎఫ్యూ0009 నంబర్ను ఏపీటోమ్ ప్రాజెక్ట్స్ రూ.7.95 లక్షలకు కైవసం చేసుకోగా, అదే సిరీస్కు చెందిన 0001 నంబర్ను పెరటి రాధిక రెడ్డి రూ.3.8లక్షలకు సొంతం చేసుకున్నారు. ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్తో మంగళవారం ఒక్కరోజే రూ.46.14లక్షలు రవాణా శాఖ ఖజానాలో జమ అయ్యింది. ఇటీవల సికింద్రాబాద్ ఆర్టీఓ పరిధిలో టీఎస్10ఎఫ్ఏ 9999 నంబర్ను నర్సింగ్రావు అనే వ్యక్తి రూ.6.10 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.