న్యూఢిల్లీ: పూర్తిగా కరోనా టీకాలు తీసుకున్న సిబ్బందితో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన తొలి అంతర్జాతీయ విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి దుబాయ్కు ప్రయాణమైంది. ఫ్లైట్ IX 191లో కెప్టెన్ డీఆర్ గుప్తా, కెప్టెన్ అలోక్ కుమార్ నాయక్తోపాటు క్యాబిన్ సిబ్బంది వెంకట్ కెల్లా, ప్రవీణ్ చంద్ర, ప్రవీణ్ చౌగ్లే, మనీషా కాంబ్లే కరోనా టీకాలను వేయించుకున్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ సిబ్బందే దుబాయ్-జైపూర్- ఢిల్లీకి రిటర్న్ ఫ్లైట్ IX 196ను నడిపారని వెల్లడించింది. అర్హత గల సిబ్బందికి, ఫ్రంట్లైన్ సిబ్బందికి కనీసం ఒక మోతాదు కరోనా టీకా వేశామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. సిబ్బంది భద్రత, ఆరోగ్యంతోపాటు విమాన ప్రయాణికులకు సురక్షితం, భరోసా కలిగించేలా చేస్తుందని పేర్కొంది.