సుల్తాన్బజార్ : ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిజాం కాలేజీలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్ లు, జెండాలను తొలగించడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ నాయకులు నాగేందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ నాయకుడు బల్మూరి వెంకట్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ బ్యానర్లను తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ ప్రతి పక్షాల మాటలకు విలువనివ్వడమేంటని అని ప్రశ్నించారు.
ఫిర్యాదు చేయడానికి బల్మూరి వెంకట్కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. ఇకమీదట ఇలాంటి పనులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని అని హచ్చరించారు.