టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం పేరుతో ట్విట్టర్లో కొందరు నకిలీ ఖాతాను తెరిచారు.. అందులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు మద్దతుగా పోస్టులు పెడుతూ పార్టీ కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాగే టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. ఈ మేరకు టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్, నాయకులు కాటం శివ, రమేశ్గౌడ్, నాగేంద్రబాబు తదితరులు శనివారం సీసీఎస్ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ అందులో పోస్టులు పెడుతున్న వా రిపై వెంటనే చర్యలు తీసుకొని, నకిలీ ఖాతాను తొలిగించాలని వారు పోలీసులను కోరారు.