కేపీహెచ్బీ కాలనీ, జూలై 18 : ప్రకృతితోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని త్రిదండి చినజీయర్స్వామి అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీలోని వికాసతరంగిని అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి 90వ జన్మదినం సందర్భంగా త్రిదండి చినజీయర్స్వామికి పాదపూజ చేశారు. ఈ సందర్భంగా చినజీయర్స్వామి మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల పలు అనర్థాలు జరుగుతున్నాయని, ప్రకృతిని కాపాడుకుంటేనే ప్రజలంతా సంతోషంగా ఉం టారన్నారు. సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతులుగా జీవించాలన్నారు. రామానుజ విగ్రహావిష్కరణలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో భారత్ టిబెట్ సమన్వయ అధ్యక్షుడు మహేందర్, యువవికాస్ అధ్యక్షుడు యోగేశ్ప్రభు, బాలు, డీజీకే రాజు, కుమారి, రామ్లక్ష్మి, శ్రీదేవి తదితరులు ఉన్నారు.