ఎల్బీనగర్, మే 24 : సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫైన్ఆర్ట్స్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్లో ఏర్పాటు చేసిన ఫైన్ఆర్ట్స్ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలలో ప్రవేశం కోసం ఆన్లైన్లో 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల విద్యాసంస్థల హైదరాబాద్, రంగారెడ్డి తూర్పు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగకల్యాణి ఒక ప్రకటనలో కోరారు. ఈ పాఠశాలలో ప్రవేశానికి ఐదవ తరగతి పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి, దుస్తులు, పుస్తకాలు అందజేస్తారని తెలిపారు.
పాఠశాలలో నిర్వహించే ఫైన్ఆర్ట్స్ కోర్సులు
ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో వివిధ కళారంగాల్లో బోధన చేయనున్నారు. కర్ణాటక సంగీతం, హిందూస్తాని సంగీతం, వయోలిన్, మృదంగం, తబల, కీ బోర్డు, గిటార్, కూచిపూడి నృత్యం, కథక్ నృత్యం, థియేటర్ ఆర్ట్స్, పెయింటింగ్, డ్రాయింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
జూన్ 4వ తేదీనరాత పరీక్ష, అర్హతలు
విద్యార్థులకు మెళకువలు నేర్పుతున్నాం
విద్యార్థులకు కళారంగంలో మెళకువలతో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఫైన్ ఆర్ట్స్ పాఠశాల ప్రారంభమైంది. ఆరవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటుగా ఆదార్ కార్టు, పాస్పోర్టు సైజు ఫొటో, విద్యార్థి సంతకం స్కాన్ చేసి ఆప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రతిని ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి. 6వ తరగతి సిలబస్తో పాటుగా కళారంగంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నాం. ఏదైనా సందేహాలు ఉంటే 1800-425-45678 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు.
– కె.నాగకల్యాణి, ఎస్సీ గురుకులాల హైదరాబాద్,రంగారెడ్డి తూర్పు సమన్వయకర్త