సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): చారిత్రక గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోట మార్గంలో వాహనాల అనుమతి లేదని చెప్పారు.