హైదరాబాద్ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్కు రానున్నారు. జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశంలో సిన్హా పాల్గొంటారు. అయితే ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి నెక్లెస్రోడ్డులోని జలవిహార్కు భారీ ర్యాలీ మధ్య సిన్హా చేరుకుంటారు. ర్యాలీ నేపథ్యంలో బేగంపేట్, లైఫ్స్టైల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, ఐమాక్స్ రోటరీ, నెక్లెస్ రోడ్, జలవిహార్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ రద్దీని బట్టి వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.
-గ్రీన్ల్యాండ్స్ నుంచి రాజ్భవన్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను మోనప్ప ఐలాండ్, రాజీవ్ గాంధీ విగ్రహాం వద్ద పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
-ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సాదన్ కాలేజీ వైపు మళ్లిస్తారు.
-మినిస్టర్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట బ్రిడ్జి వద్ద నుంచి బుద్దభవన్, ట్యాంక్బండ్ వైపు మళ్లిస్తారు.
-మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా వద్ద నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు మళ్లిస్తారు.