సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల సమయంలో నీటి ముంపు సమస్య తలెత్తుతున్న తెల్లాపూర్లోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ , ఆర్సీసీ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై నేటి నుంచి 25 రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలో నల్లగండ్ల-తెల్లాపూర్ రోడ్డు లో ఎస్బీఐ తెల్లాపూర్ వద్ద ఒక వైపు రహదారిని పూర్తిగా మూసివేస్తున్నట్లు తె లిపారు. దీంతో ఎస్బీఐ తెల్లాపూర్ యూ టర్న్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ యూ టర్న్ వరకు సుమారు 300 మీటర్ల మేర వాహనాలను అందుబాటులో ఉన్న ప్ర త్యామ్నాయ మార్గాల వైపు దారి మళ్లించనున్నట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల మీదుగా వెళ్లడం మంచిదని పోలీసులు సూచించారు.