హైదరాబాద్ : మీరు సైబరాబాద్ పరిధిలోని దూలపల్లి మార్గంలో ప్రయాణిస్తున్నారా? అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద దూలపల్లి టీ జంక్షన్ – దూలపల్లి గ్రామం వద్ద కల్వర్టు నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రేపట్నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
-మేడ్చల్ నుంచి కొంపల్లి, దూలపల్లి టీ జంక్షన్ మీదుగా దూలపల్లి, బహదూర్పల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను మేడ్చల్ చెక్ పోస్టు, కండ్లకోయ నుంచి సుతారిగూడ, ఆయోధ్య జంక్షన్, గండిమైసమ్మ, బహదూర్పల్లి జంక్షన్ లెఫ్ట్ టర్న్ మీదుగా దూలపల్లి గ్రామానికి మళ్లించనున్నారు.
-సుచిత్ర జంక్షన్ నుంచి దూలపల్లి టీ జంక్షన్ మీదుగా దూలపల్లి, బహదూర్పల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను సుచిత్ర జంక్షన్ లెఫ్ట్ టర్న్ వద్ద మళ్లించనున్నారు. కుత్బుల్లాపూర్ విలేజ్, కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీసు వై జంక్షన్ రైట్ టర్న్, షాపూర్నగర్, జీడిమెట్ల ఇండస్ట్రీయల్ ఏరియా జేఈటీఎల్ హై టెన్షన్ రోడ్డు నుంచి దూలపల్లి, బహదూర్ పల్లికి మళ్లించనున్నారు.
-బహదూర్పల్లి, దూలపల్లి గ్రామాల నుంచి దూలపల్లి టీ జంక్షన్ మీదుగా సుచిత్ర జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దూలపల్లి విలేజ్ ఎన్టీఆర్ విగ్రహం, జీడిమెట్ల ఇండస్ట్రీయల్ ఏరియా, జేఈటీఎల్ జంక్షన్ లెఫ్ట్ టర్న్, షాపూర్నగర్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, కుత్బుల్లాపూర్ విలేజ్ మీదుగా మళ్లించనున్నారు.
-బహదూర్పల్లి, దూలపల్లి గ్రామాల నుంచి దూలపల్లి టీ జంక్షన్, మేడ్చల్ వైపు వచ్చే వాహనాలను బహదూర్పల్లి జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. గండిమైసమ్మ జంక్షన్, అయోధ్య జంక్షన్, సుతారిగూడ మీదుగా మేడ్చల్ చెక్ పోస్టు లేదా కండ్లకోయకు మళ్లించనున్నారు.