మెహిదీపట్నం, సెప్టెంబర్ 19: పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నాళ్ల క్రితం మరణించాడు. ఆమె కుమారుడితో కలిసి జీవిస్తున్నది. బాధ్యతలు, ఒంటరితనం భరించలేక ఆదివారం రాత్రి పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది.
తొలుత వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, వాహనదారులు ఆమెను తప్పించడంతో ఫలించలేదు. దీంతో బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే డ్యూటీలో ఉన్న ఆసిఫ్నగర్ ట్రాఫిక్ ఏఎస్ఐ మన్నాన్ ఖాన్, కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డు నీలం నాయుడు గమనించి ఆమెను రక్షించారు. అనంతరం ఆమెను ఆసిఫ్నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు.