హైదరాబాద్ : హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కుండపోత వర్షం కురుస్తోంది. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మల్కం చెరువుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అక్కడ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి టోలిచౌకీ, మెహిదీపట్నం వైపు రావాల్సిన వాహనదారులు.. గబచ్చిబౌలి జంక్షన్ నుంచి నార్సింగి, టిప్పు ఖాన్ బ్రిడ్జి, లంగర్హౌజ్, నానల్ నగర్ మీదుగా మెహిదీపట్నం మీదుగా చేరుకోవాలి. లేదా బయో డైవర్సిటీ, ఐకియా, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ మీదుగా మెహిదీపట్నం చేరుకోవాలి.