సుల్తాన్బజార్, డిసెంబర్ 1: టీఎన్జీవో వాటర్ వర్క్స్, సీవరేజి బోర్డ్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. గురువారం నాంపల్లిలోని జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి ఖలీద్ అహ్మద్ వ్యవహరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసు కున్నారు. టీఎన్జీవో వాటర్ వర్క్స్, సీవరేజి బోర్డ్ యూనిట్ అధ్యక్షుడిగా ఎం మహేశ్కుమార్, కార్యదర్శిగా అజయ్సింగ్ ఠాకూర్, కోశాధికారిగా నవీన్ కుమార్ సావంత్, ఉపాధ్యాక్షులుగా సంతోష్ కుమార్ మదివేణి,కె. శ్రీదేవి, బిల్కిస్ భాను, సంయుక్త కార్యదర్శులుగా అశ్విన్ కుమార్ మేకల, భరత్ కుమార్ పులి, సాయి కృష్ణ పుప్పాల, కార్యనిర్వాహణ కార్యదర్శిగా వెంకటేశ్ బొమ్మిడి, ప్రచార కార్యదర్శిగా బాలసుబ్రమణ్యం గుండాపు, కార్యవర్గ సభ్యులుగా జగదీశ్, మహేందర్ చింతాల, ప్రవీణ్ మందా, భార్గవ్ రెడ్డి రావుల, తేజశ్విని గురుజాల, సాయి జయశ్రీ గోపిశెట్టి, చంద్రకాంత్ మణికొండలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వివరించారు. అనంతరం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ, కార్యదర్శి ఎస్ విక్రమ్కుమార్లు నూతనంగా ఎన్నికైన యూనిట్ కార్యవ ర్గానికి నియామక పత్రాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.