బడంగ్పేట, జూలై 22: దొంగలు స్థానికంగా ఉం టూ పోలీస్ వాళ్ళు ఎప్పుడు., ఎక్కడి నుంచి వస్తున్నా రో..? గమనించి దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారు తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకునే ముందడుగు వేస్తున్నారు. పోలీసులు ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ దొంగలే ముందు వరుసలో కూర్చొని, వారి వ్యూహ రచనలను ముందుగానే పసిగడుతున్నారు. పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే చోరీలకు పాల్పడుతున్నారు. ఇలా దొంగ లు కొత్త తరహా వ్యూహాలకు పూనుకుంటున్నారు.
వరుస చోరీలకు పాల్పడుతున్నారు…
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ఇటీవల పట్టుకోవడం జరిగిందని మహేశ్వరం డీసీపీ సీహెచ్ శ్రీనివాసులు తెలిపారు. తుక్కుగూడలో ఉన్న డీసీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులతో పాటు వారిని వస్తువులు కొనుగోలు చేస్తున్న అతనిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. షాహిన్ నగర్లో నివాసి సయ్యద్ ఖాజా అలీ (20), బాలాపూర్ పరిధిలోని ఉస్మాన్ నగర్ వాసి షేక్ ఆరీఫ్(21), ఈది బజార్కు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్ (37)తో పాటో మరో మైనర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్, బిస్మల్లా కాలనీ, యాహ కాలనీలలో వీరు దొంగతనాలకు పాల్పడుతునట్లు తెలిపారు. ఇప్పటికే 21 దొంగతనాలు చేసినట్లు డీసీపీ తెలిపారు. వారు ఒకే ఏరియాలో ఉంటూ పలు దొంగతనాలకు పాల్పడుతుండతున్నారని పేర్కొన్నారు.
మూడు నెలలు జైల్లో ఉండొచ్చిన ఖాజా…
సయ్యద్ ఖాజా మూడు నెలలు జైల్లో ఉండి రావడం జరిగిందన్నారు. ఇద్దరిని పెండ్లీ చేసుకున్నాడని పేర్కొన్నారు. రెండు పల్సర్ బైక్లు, రెండు ఆటోలు కొనుక్కోవడం జరిగిందన్నారు. వాటికి నెంబర్లు లేకుండా రాత్రి సమయంలో తిరిగే వారన్నారు. సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిఘా పెట్టి దొంగలను పట్టుకోవడం జరిగిందన్నారు. వారు దొంగిలించిన బంగారం, ఇతర వస్తువులను ఈది బజార్లో ఉండే సిరాజ్కు అమ్మే వారన్నారు. ముగ్గుర్నీ రిమాండ్కు తరలించినట్టు డీసీపీ పేర్కొన్నారు. వారి నుంచి 16 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్స్, రెండు బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కొత్తగా కాలనీలలో తిరుగుతున్న వారిని ప్రజలు గమనించాలని డీసీపీ పేర్కొన్నారు. కొత్తవారు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి సీసీ కెమరాలను అమర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ అంజయ్య, సీఐ వెంకట్ రెడ్డి, డీఐ కోటేశ్వర్ రావు, పోలీసులు శ్రీధర్, ప్రభాకర్, మనిక్రిష్ణ, క్రాంతి, వెంకటేశం పాల్గొన్నారు.