ఖైరతాబాద్, జనవరి 18 : జెండర్ సెన్సివిటీపై ప్రతి ఒక్కకిరి అవగాహన ఉండాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భూమిక విమెన్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, లైంగిక దాడులపై ప్రచురితం, ప్రసారం చేస్తున్న కథనాలు, జెండర్ సున్నితత్వం తదితర అంశాలపై చర్చించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ ఆడపిల్లలపై ఏదైనా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, లైంగికదాడులు జరిగితే మీడియాలో వచ్చే కథనాలు బాధితులను మరింత బాధపెట్టే విధంగా ఉండకూడదని సూచించారు.
ఈ అంశాలపై మీడియాకు అవగాహన తరగతులు ఎంతో ఉపయోగపడుతాయని, అందు కు సమగ్రమైన కోర్సు, మాడ్యుల్ను రూపొందించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం విశ్రాంత ప్రొఫెసర్ పద్మజా షా, పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ ఏఎల్ శారద తదితరులు పాల్గొన్నారు.