శంషాబాద్, అక్టోబర్ 28; రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వాహనదారులపై దాడికి పాల్పడి దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ, సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి వివరాలు వెల్లడించారు. మహ్మద్ హర్షద్ ఖాన్, జావేద్ చవాన్, షారూఖ్, మహ్మద్ అఫ్జల్, అక్బర్ చవాన్, మహ్మద్ ఫైజాన్ ముఠాగా ఏర్పడ్డారు. ఎయిర్ పిస్టల్, ఇనుప రాడ్లు తదితరల మారణాయుధాలను సమకూర్చుకొని.. కారును అద్దెకు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, చేవెళ్ల, సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దారి దోపిడీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సొమ్ము రికవరీ చేసి..మారణాయుధాలను, కారును సీజ్ చేశారు.