గోల్నాక, జనవరి 19 : అంబర్పేటలో ఘోరం జరిగింది. బర్త్ డే కేక్ కట్ చేయించలేదని బాలికపై ఓ బాలుడు కత్తితో దాడి చేసి, ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్అంబర్పేట తురాబ్నగర్కు చెందిన అంజయ్య కుమారుడు రమణ(16) మల్లిఖార్జుననగర్కు చెందిన ఓ బాలిక(16) పదోతరగతిలో క్లాస్మేట్స్. ప్రస్తుతం వేర్వేరు కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.
కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడుతున్న బాలుడు శుక్రవారం తన పుట్టిన రోజు కావడంతో, గురువారం రాత్రి తన ముందు కేక్ కట్ చేయాలనుకున్నాడు. ఇందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బాలిక సోదరిని కూడా గాయపర్చి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం విద్యానగర్ రైలు పట్టాలపై బాలుడి మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి జరిగిన ఘటనపై భయాందోళనతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.