ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం పహాడీషరీఫ్లోని ఉమర్కాలనీకి చెందిన షేక్ అహ్మద్ మంగళవారం రాత్రి టోలిచౌకిలోని అత్తగారింటికి వెళ్లాడు.
తిరిగి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి తన బుర్గుమేన్ ద్విచక్రవాహనాన్ని ఇంటి ముందు పార్కు చేశాడు. 7 గంటలకు బయటకి వచ్చి చూడగా ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు తన వాహనాన్ని తగులబెట్టారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.