ఎల్బీనగర్ : ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం వజీర్ ప్రకాష్గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ప్రభుత్వ పాఠశాల ప్రహారీగోడ పెయింటింగ్ , మొక్కలకు ట్రీగార్డులు, ఫుట్పాత్ నిర్మాణం చేసి బెంచీలను ఏర్పాటు చేసి సుందరీకరణ చేసిన పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అన్ని మౌళిక వసతులు కల్పించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా వీపీజీ ఫౌండేషన్ ద్వారా వజీర్ ప్రకాష్గౌడ్ తన తల్లి మణెమ్మ జ్ఞాపకార్థం ఫుట్పాత్లతో పాటుగా పాఠశాల సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్దికి దాతలు సహాకారం అందించడం శుభ పరిణామమన్నారు. వీపీజీ ఫౌండేషన్ ద్వారా చేపట్టిన పనులను ఆయన అభినందించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, మాజీ కార్పొరేటర్, వీపీజీ ఫౌండేషన్ ఛైర్మన్ వజీర్ ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు తన తల్లిపేరిట ఎంతో కొంత సహాకారం అందించాలన్న లక్ష్యంతో పుట్పాత్ నిర్మాణం, పెయింటింగ్ పనులను చేపట్టామన్నారు. భవిష్యత్తులోనూ మరింత సహాకారం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, చైతన్యపురి సీఐ రవికుమార్, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాల్గౌడ్, అనంతుల రాజారెడ్డి, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు తోట మహేష్యాదవ్, బొగ్గారపు శరత్చంద్ర, శ్వేతారెడ్డి, నాగలక్ష్మీ, రూపా సింగ్, ఉదయ్ గౌడ్, జ్యోతి, హెడ్మస్టర్లు పద్మారావు, శ్రీనివాస్, తోట శ్రీనివాస్ యాదవ్, పిల్లి గోపాల్ యాదవ్, కొమ్ము బాబు, తావుల బాబు, కంఠం శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.