మహేశ్వరం : సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంగూడ, మంఖాల్ పరిధిలోని 6,7,8 వార్డులలో 57.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీరోడ్లు, వీధి విక్రయధారుల సముదాయము, ఓపెన్జిమ్ పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతుందని అన్నారు.సంక్షోభంలోను సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో మున్సిపాలిటీలకు నూతన హంగులు కల్పించడానికి కొట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని ఆమె అన్నారు.
తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, నాళాల ఏర్పాటు, వీధిదీపాలు, చెరువుల సుందరీకరణ పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఒకే రోజు నియాజక వర్గంలోని రెండు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో 371 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కేటీఆర్తో శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు.అనంతరం ఇమామ్గూడలో సీ ఈ ల్యాబ్స్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ను మంత్రి ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కమిషనర్ జ్ఞానేశ్వర్, మేనేజర్ పర్వతాలు వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బూడిదజేజస్విని శ్రీకాంత్గౌడ్, రెడ్డిగళ్ల సమన్ మున్సిపాలిటీ అద్యక్షులు జిల్లెల లక్ష్మయ్య, యూత్ అద్యక్షులు కీసరి సామ్యూల్రాజు, మహిళా అద్యక్షురాలు పద్మాబాస్కర్రెడ్డి, మహేశ్వరం మండల పార్టీ అద్యక్షులు అంగోతు రాజునాయక్, మాజీ అద్యక్షులు హనుమగల్ల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.