సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పశ్చిమ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠం 24.5 డిగ్రీలు, గాలిలో తేమ 23 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి, పగలు లేదా రాత్రి సమయాల్లో గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.